ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కరోనాతో 47,228 మంది మరణించారు: కేంద్రం వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 05:30 PM

ఏపీలో కరోనా వైరస్ కారణంగా 47,228 మంది మరణించారని ఏపీలో కరోనా మృతులకు సంబంధించిన వివరాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ సమాధానం ఇచ్చారు. కొవిడ్‌ కారణంగా మరణించిన వారి కుటుంబాల నుంచి నష్టపరిహారం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ఎంపీ ప్రశ్నించారు. ఎంత మందికి చెల్లించారని.. ఎన్ని తిరస్కరించారని ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు సహాయనిధి ద్వారా చెల్లించిన పరిహారం లెక్కల ద్వారా ఈ సమాచారం బయటపడింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ఈ ఏడాది మే 27 నాటికి 7,91,353 దరఖాస్తులను పరిష్కరించి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించింది కేంద్రం. ఏపీ ప్రభుత్వం జులై 26న రాసిన లేఖ ప్రకారం పరిహారం కోసం 50,399 దరఖాస్తులు వచ్చాయని.. వాటిలో 47,228 క్లెయిమ్స్‌ను ఆమోదించి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లించారన్నారు. అలాగే 3,171 దరఖాస్తులను తిరస్కరించారని కేంద్రమంత్రి తెలిపారు. అంటే రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించిన 14,733 మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య 220% అధికం అంటున్నారు. దేశవ్యాప్తంగా మరణించిన 7,91,353 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa