ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ప్లకార్డులు సభకు వచ్చిన వారు తీసుకొచ్చింది కాదా: ఎంపీ రఘు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 05:31 PM

కాపునేస్తం పంపిణీ సందర్బంగా చోటుచేసుకొన్న ఓ ఘటనను ఆధారంగా చేసుకొని జగన్ సర్కార్‌‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ విమర్శలు  సంథించారు. వాట్ ఏ ఐడియా సర్ జీ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు. కాపు నేస్తం కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. సొంత పార్టీని ఎద్దేవా చేశారు. ‘వాట్ ఏన్ ఐడియా సర్ జీ.. ఈ ఫోటోను చూసిన తర్వాత కాపు నేస్తం కార్యక్రమానికి వచ్చినవారంతా స్వచ్ఛందంగా ఈ ప్లకార్డులు తీసుకుని వచ్చారని అనుకున్నాను. కనీసం మా పార్టీ వాలంటీర్లు బస్సుల్లో తీసుకొచ్చినప్పుడు ఈ ప్లకార్డులు ప్రజలకు అందజేసి ఉంటే తెలివిగా ఉండేది’అంటూ సెటైర్లు పేల్చారు.


శుక్రవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం మూడో విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేశారు. ఈ సభకు హాజరైన మహిళలు Thank You CM Sir అనే ప్లకార్డులు పట్టుకున్నారు. అయితే సభలో ఈ ప్లకార్డుల్ని కుర్చీల్లో ఉంచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోను ప్రస్తారవిస్తూ రఘురామ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa