రాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై జగన్ రెడ్డి అండ్ కో మొదటి నుంచీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని టీడీపీ నాయకులూ కింజారపు అచ్చేమ్ నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పూలకుంటలో రజకులపై వైసీపీ నేత నరసింహారెడ్డి కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. డబ్బులు ఇవ్వకండా బట్టలు ఉతకాలంటూ వేధింపులకు దిగడం అమానుషం.
కుల అహంకారంతో నరసింహారెడ్డి వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేత చర్యతో రజకవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.15 రోజులుగా వేధిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తక్షణమే నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలి.రజకులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa