పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్రెడ్డి అందిస్తున్న వైయస్సార్ పింఛన్ కానుకతో ఎంతో భరోసా లభిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం సారవకోటలో జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, గత టీడీపీ పాలన లో పెన్షన్లు రాక ఎంతోమంది వంచనకు గురయ్యేవారన్నారు. కొత్త పింఛన్ ఇవ్వాలంటే అప్పటివరకూ దానిని అందుకుంటున్నవారు ఎవరో చనిపోతే గానీ కొత్త వారికిచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. పింఛన్లు ఇస్తామని జన్మభూమి కమిటీల నాయకులు కూడా అందినంత దోచుకునేవారని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అరాచకానికి చెక్ పెట్టారని అన్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నాటికే పింఛన్లు ఈ ప్రభుత్వ పాలనలో అందరికీ అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa