విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో ఆగస్టు 4న చీపురుపల్లి పీఎస్ పరిధిలో గల రైల్వే స్టేషను జంక్షన్ వద్ద ఎస్ఐ సన్యాసి నాయుడు మరియు సిబ్బంది రైడ్ చేసి, 19 మద్యం బాటిళ్లు ను అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. అలానే రావివలస జంక్షన్ వద్ద మద్యం బాటిళ్లును అనధికారంగా కలిగివున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి, 40 బాటిళ్లు స్వాధీనం చేసుకొని, రిమాండ్ కు తరలించారు.
వీటితో పాటు విజయనగరం పట్టణంలో గల ఉడా కాలనీ ప్రజలకు 1వ పట్టణ సిఐ శ్రీ బి.వెంకటరావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది సైబరు మోసాలు, దొంగతనాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపి, రహదారి భద్రత, దిశా యాప్ పట్ల అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa