ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొబ్బిలి లొ ఏసీబీకు చేతికి చిక్కిన 40 భవనాల అక్రమ నిర్మాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 01:58 PM

బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగం లో రెండోరోజు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ సిఐలు మహేష్, వెంకట్రావు, ఎస్సై వాసుదేవరావు లో ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో రామరాజ్యం ఆసుపత్రి దరిలో రెండు భవన నిర్మాణాలను రహదారి భవనాల శాఖ, గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో కొలతలు వేశారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికా రులు భవన నిర్మాణాలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు? ప్రభుత్వానికి చెల్లించ వలసిన ఫీజులు చెల్లించారా లేదా? భవన నిర్మాణ యజమానులు ఏ విధంగా నిర్మాణాలు చేపట్టారు, నిబంధన ప్రకారం నిర్మాణాలు చేపట్టేరా, లేదా, దర్యాప్తు చేసినట్లు తెలిపారు. వి ఎల్ టి టాక్స్, పీనల్ చార్జెస్ వాటిపై ఆడిట్ చేపట్టి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని తెలిపారు. బి పి ఎస్, సెట్ బ్యాక్ వంటి అనుమతులు పలుభవన నిర్మానులు పాటించలేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. బొబ్బిలి మున్సిపల్ నుండి 400 మంది వరకు భవన నిర్మాణాలకు అనుమతులకు దరఖాస్తులు చేశారని, అందులో కొన్ని దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు రిజెక్ట్ చేశారని, 240 దరఖాస్తుల వరకు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, మరో ఇచ్చిన 91 మంది అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, 75 మందికి నోటీసులు కూడా జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు విలేకరులకు తెలిపారు.


పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. మరిన్ని సోదాలు జరపున్నట్టు ఈ సందర్గంగా తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజల నుండి లంచాలు డిమాండ్ చేస్తే అటువంటి అధికారులపై ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 14400 ప్రవేశపెట్టిందని టోల్ ఫ్రీ నెంబర్ కు బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిపై పలు ఫిర్యాదులు రావడంతో ఫిర్యాదులపై గురువారం అర్ధరాత్రి వరకు ఏసీబీ డిఎస్పి రామచంద్ర రావు ఆధ్వర్యంలో 20 మంది సిబ్బందితో పట్టణ ప్రణాళిక విభాగం లో పలు రికార్డులను పట్టణ ప్రణాళిక విభాగంలో కొన్ని రికార్డులు సోదాలు చేసిన విషయం విధితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa