వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకొంది.వీడియో ఎపిసోడ్లో.. తన ఫోటో పెట్టి దుష్ప్రచారం జరుగుతోందని అనితారెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎస్సై తెలిపారు. వేణు, బొప్పూరి రమణ, అబ్దుల్ కరీమ్, చందు, నవీన్ కుమార్పై ఫైల్ చఏశారు. వీరిలో అబ్దుల్ కుమార్ మంగళగిరి వాసిగా పోలీసులు గుర్తించారు. మిగతా నలుగురి వివరాలపైనా ఆరా తీస్తున్నారు.
టీడీపీ, జనసేన పార్టీకి చెందిన కొందరు ఎంపీ మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో.. ఆయన పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారని పోలీసులకు అనితారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫోటోతో వేధిస్తున్నారని.. దీని వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని గాండ్లపెంట పోలీసుస్టేషన్లో ఆదివారం ఆమె ఫిర్యాదు అందజేశారు. తాను వైఎస్సార్సీపీ కోసం సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అప్పటినుంచి కొంతమంది తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.
నీచంగా ఎంపీ మాధవ్ పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారని.. చాలా రోజులుగా ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని ఆమె చెబుతున్నారు. ఈ కుట్ర వెనుక టీడీపీ ఉందని.. ఆ పార్టీ ఆఫీస్ నుంచే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. లోకేష్ డైరెక్షన్లోనే కుట్ర జరిగిందని.. ఇప్పుడు ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో ఆయన పక్కన, తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని చెబుతున్నారు. ఈ ఫోటోను వైరల్ చేస్తూ తనను వేధిస్తున్నారంటున్నారు. తన ఫొటో మార్ఫింగ్ చేసిన, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారందరిపై చర్య లు తీసుకోవాలన్నారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa