కామన్వవెల్త్ క్రీడాల్లో మన క్రీడాకారులు సాధించిన విజయాలు క్రీడాభిమానులు, ఔత్సాహిక క్రీడాకారులతో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత పతకాల పంట పండించింది. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారులు నాలుగో స్థానంలో నిలిచి మొత్తం 61 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను క్రీడాకులు సాధించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలవడం గొప్పగా అనిపించిందంటూ క్రీడాకారులను అభినందించారు.
షటిల్ బాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో క్రీడాకారుల ఆటతీరు ముచ్చటగొలిపిందని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం మనందరికీ ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. పీవీ సింధు, ఆచంట శరత్ కమల్, సాత్విక్ సాయిరాజ్, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మేఘన, రజని, హుస్సాబుద్ధీన్, కిదాంబి శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్తో పాటు పోటీల్లో పాల్గొన్న సుమిత్ రెడ్డి, జ్యోతిలకు తెలుగు ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పవన్ కోరారు.
ఈ విజయాలు క్రీడాభిమానులు, ఔత్సాహిక క్రీడాకారులతో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పోటీల్లో క్రీడాకారులు విజయం సాధించడానికి వెన్నంటి ప్రోత్సహించిన కోచ్లు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. 2024 పారిస్లో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో కూడా భారత క్రీడాకారులు ఇదే జైత్రయాత్ర కొనసాగించాలని జనసేనాని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa