ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెల్లి..సోదరుడి మధ్య పెరిగిపోతున్నవార్...తాజాగా అఖిల ప్రియపై భూమా కిశోర్ రెడ్డి విమర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 02:21 PM

మాజీ మంత్రి అఖిలప్రియపై సోదరుడు, బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి మధ్య వార్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఆళ్లగడ్డలో అఖిలప్రియ అగడాలు పెరిగిపోయాయని భూమా అఖిల ప్రియపై ఆయన సోదరుడు భూమా కిశోర్ రెడ్డి తాజాగా విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని.. పంచాయితీ పేరుతో పిలిచి రుద్రవరం గ్రామానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తిని కొట్టి రూ.1.35 కోట్లు కాజేశారని ఆరోపించారు. రెహమాన్ డబ్బులు టీడీపీ ఇప్పించాలని.. అతనికి ఏమైనా జరిగితే టీడీపీదే బాధ్యత అన్నారు. మైనారిటీకి అన్యాయం జరిగితే అళ్ళగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదని.. వారు ఎందుకు స్పందించలేదన్నారు.


అఖిలప్రియ తప్పులను ప్రశ్నించే దమ్ము టీడీపీ నేతలకు లేదా అంటూ ప్రశ్నించారు కిషోర్ రెడ్డి. ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.. బాధితుడికి న్యాయం చేయాలన్నారు. ఇదంతా టీడీపీ నేతలకు తెలిసే జరుగుతుందా.. మిగిలిన నేతలు ఎందుకు స్పందించడం లేదని.. అడిగే ధైర్యం లేదా అన్నారు. ఇలాంటి వారితో ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.


కొంతకాలంగా భూమా అఖిలప్రియ, కిషోర్ రెడ్డిల మధ్య వార్ నడుస్తోంది. కిషోర్ కూడా గతంలో టీడీపీలో ఉండగా.. 2019 ఎన్నికల తర్వాత భూమా వర్గంలో విభేదాలు వచ్చాయి. అఖిలప్రియ భర్త జోక్యం ఎక్కువైపోతుందని భూమా సోదరులు అసహనం వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తితో బీజేపీలో చేరగా.. అప్పటి నంచి భూమా కుటుంబం రెండు వర్గాలుగా మారింది. అలాగే భూమా కిషోర్ రెడ్డి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌పై ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఖాళీ స్థలంలో కట్టుకున్న కాంపౌండ్ వాల్ కూల్చివేసి వాచ్ మెన్‌పై దాడి చేశారని ఆయన ఆరోపించారు. భూమా దంపతులతో పాటూ పలువురు అనుచరులపైనా అప్పుడే కేసులు నమోదయ్యాయి.


అంతేకాదు భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆ విగ్రహాలను ఆవిష్కరించడంతో పెద్ద హైడ్రామా నడిచింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన భూమా కిషోర్ రెడ్డి అనుచరులు ఒకింత ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa