ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంశీని విమర్శించినందుకు టీడీపీ ఎమ్మెల్సీని నిలదీసిన మహిళలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 02:24 PM

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విమర్శించినందుకు టీడీపీ ఎమ్మెల్సీని కొందరు మహిళలు నిలదీశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ పరిణమం చోటు చేసుకొంది. ఎమ్మెల్సీ, పార్టీ ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడు చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఊహంచని పరిణామం ఎదురైంది. ఈ కార్యక్రమాన్ని బాపులపాడు మండలం తిప్పనగుంటలో నిర్వహించారు. ఇంటింటికి టీడీపీలో ఇంఛార్జ్ బచ్చులు అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు ముద్ర బోయిన వెంకటేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్‌లు హాజరయ్యారు. తిప్పనగుంటలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని స్థానిక మహిళలు నీలదీశారు.


వైసీపీ ప్రభుత్వం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఎమ్మెల్యే వంశీ కొన్ని పనులు చేశారని.. అప్పుడప్పుడు వచ్చే వాళ్లు గ్రామంలో తిరుగుతున్నారు ప్రశ్నించారు. టీడీపీ వల్ల తమకు ఒరిగిందేమీ లేదంటూ కొలవెంటి లక్ష్మీతో పాటు మహిళలు మండిపడ్డారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే ఓటు వేస్తామని.. గ్రామ అభివృద్ధితో పాటు తమకు ఏ సమస్య వచ్చినా వంశీనే పరిష్కరిస్తున్నారన్నారు.


ప్రశ్నించిన మహిళలను బచ్చుల అర్జునుడు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వారించేందుకు ప్రయత్నించారు. ‘మీరు ఏం చేశారు? వస్తున్నారు.. వెళ్తున్నారు.. ! మాకు ఎలాంటి న్యాయం చేయటం లేదు’ అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa