గొయ్యి ఎంత తవ్వితే అంతే ఏర్పడుతుంది. కానీ చిలీలో ఏర్పడిన భారీ గొయ్యి ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది. జూలై 30న ఒక్కసారిగా పుట్టుకొచ్చిన ఈ భారీ గొయ్యి అంతకంతకూ విస్తరిస్తోంది. ఆగస్టు 8 నాటికి ఇది రెండింతలు అయ్యింది. 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకు పెరిగిపోయింది. ఇదిలావుంటే చిలీకి చెందిన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ విభాగం అధికారులు ఈ సింక్ హోల్ ఏర్పడటానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఎంత పెద్దగా ఉందంటే.. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహమైన భారత్లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఇందులో సులభంగా ఇమిడిపోతుంది. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఆర్క్ డి ట్రయాంఫ్ పూర్తిగా ఈ గొయ్యిలో పట్టగలదు. ఈ మిస్టరీ గొయ్యి ఏర్పడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ సింక్ హోల్ అంతకంతకూ విస్తరిస్తుండటంతో దాని సమీపంలోని కాపర్ మైన్కు సమస్య ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా అల్కాపరోసా భూగర్భ గని వరదల్లో చిక్కుకోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాకు చెందిన లుండిన్ మైనింగ్ ఎల్యూఎన్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ అండర్ గ్రౌండ్ గనిలో పనులను తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ గనిలో 80 శాతం వాటా కెనడా కంపెనీకి ఉండగా.. మిగిలిన 20 శాతం వాటా జపాన్కు చెందిన సుమిటోమో మెటల్ మైనింగ్కు ఉంది.
చిలీకి చెందిన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ విభాగం అధికారులు ఈ సింక్ హోల్ ఏర్పడటానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. కాపర్ గనిలో అనుమతులకు మించి మైనింగ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చిలీ మంత్రి ఒకరు తెలిపారు. గనిలో ఇప్పటికే నీటిని తోడే యంత్రాలను చేర్చారు. గని ఛాంబర్లు ఎక్కడైనా దెబ్బ తిన్నాయేమో పరిశీలించనున్నారు. ఈ భారీ గొయ్యిని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa