ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దుర్బాషలాడటం దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 09:26 PM

న్యూడ్ వీడియోలతో మహిళల్ని వేధిస్తున్న మాధవ్ లాంటి వారిపై చర్యలు తీసుకోకపోగా, ప్రభుత్వమే వెనకేసుకురావడం వలనే మహిళలకు వేధింపులు పెరిగిపోతున్నాయి అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. 


ఇంకా పోతే తాజాగా  తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో సర్పంచ్ కుమారుడు వైసిపి నేత క్రాంతి కుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దుర్బాషలాడటం దారుణం అని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. 


సోషల్ మీడియా ద్వారా అయన ఈ వీడియో చూపిస్తూ...  మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్రాంతి కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకొని ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలి. రాఖీ పండుగ సందర్భంగానైనా జగన్ రెడ్డి గారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి మహిళలకు న్యాయం చెయ్యాలని ఆశిస్తున్నాను. ఒక్క మాధవ్ పైనైనా చర్యలు తీసుకుంటే వైసీపీలో రోజుకో మాధవ్ పుట్టుకు రావడం తగ్గుతుంది అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa