చింతపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం శనివారం ఉదయం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సభ్యులు పోతు రాజు బాలయ్య పడాలు హాజరయ్యారు. జడ్పీటీసీ మాట్లాడుతూ మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ద్వారా తీర్మానం చేసిన కార్యక్రమంలు వ్యవసాయ అభివృద్ధి కి తోడ్పాటు పడతాయి అని పేర్కొన్నారు. రైతుబరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నయ్యన్నరు. మండల వ్యవసాయాధికారి ఈ పంట ప్రయోజనాలు మరియు ఇన్సూరెన్స్ పై అవగాహన కలిపించారు. ఉద్యన వన అధికారి వివిధ పథకాలు గూర్చి అవగాహన కల్పించారు, పశు సంవర్ధ శాఖ అధికారి వారు వారి డిపార్ట్మెంట్ స్కీమ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ జడ్పీటీసీ గారు మండలంలోని 21 రైతుబరోసా కేంద్రాలకు కంప్యూటర్స్ ను వారి చేతుల మీదిగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చింతపల్లి వ్యవసాయ సహాయకులు కె. జాహ్నవి గారు, ఉద్యాన అధికారి. బాల కర్ణ, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక అధికారిణి దమయంతి, మండలి సభ్యులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa