శృంగవరపుకోట మండలం వినాయకపల్లి గ్రామానికి చెందిన వెలుసూరి నారంనాయుడు తన సేవా తత్పరతను చాటుకున్నారు. తన చిన్నతనంలో తన గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న చిన్ననాటి జ్ఞాపకాలను తలంచుకుంటూ తాను చదువుకున్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా తనవంతుగా పలకలు, నోట్ పుస్తకాలను, పెన్నలు, పెన్సిల్లు, బాక్సులు, పేడ్స్ వగైరా సంబంధిత విద్యా సంబంధ వస్తువులను వేలాది రూపాయల సొంత ఖర్చులతో వితరణ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం నారంనాయుడు వితరణ చేసిన విద్యాసంబంధ వస్తువులను స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ నేపథ్యంలో నారంనాయుడు చేస్తున్న సేవాకార్యక్రమాలను ఎమ్మెల్సీ ఇందుకూరి ప్రశంసిస్తూ ఆయనకు తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురాజుకు నారంనాయుడు పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నారంనాయుడు మాట్లాడుతూ తన చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సరిపల్లి పావని, వైస్ చైర్మన్ సన్యాసమ్మ, ప్రధానోపాధ్యాయులు జీవి రమణ, సహోపాధ్యాయులు వెలుచూరి మహేష్, గ్రామ కార్యదర్శి సంతోష్ కుమార్, గ్రామ వాలంటీర్లు, స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలుచూరి రామచంద్ర, వెలుచూరి కృష్ణం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa