శృంగవరపుకోట మండల కేంద్రంతో పాటుగా శృంగవరపుకోట మండలంలో ఆజాదికా అమృత్ మహోత్సవం కార్యక్రమం కన్నులు పండుగగా సాగుతోంది. శృంగవరపుకోట ఎంపీపీ సండి సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో సుమారు నాలుగు వందల ద్విచక్ర వాహనాలతో జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తిస్తూ శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి స్థానిక దేవి కూడలి మీదుగా వెంకటరమణపేట, తిమిడి, వసి, ఉసిరి, వినాయకపల్లి, సంత గౌరమ్మపేట, సీతంపేట గ్రామాల గుండా భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం యస్. కోట పోలీస్ స్టేషన్ మీదుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి, ఎమ్మెల్యే కడుబండి ఆయా గ్రామ ప్రజలకు జాతీయ పతాకం విశిష్టతను వివరిస్తూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నేతలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలను శృంగవరపుకోట మండలంలో ఘనంగా నిర్వహించడంతో మండలంలో ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజు నిర్వహించడం పట్ల ఇలాంటి నేతలు నియోజకవర్గంలో ఉండడం ప్రజలు చేసుకున్న పుణ్యమని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శృంగవరపుకోట నియోజకవర్గంలో స్థానిక నేతలు ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవం విజయవంతంగా సాగుతోంది. కార్యక్రమంలో జడ్పిటిసి ముమ్ములూరు వెంకటలక్ష్మి, శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ సంతోషి కుమారితో పాటుగా స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa