తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5వ తేదీ నుంచి యాత్ర ప్రారంభిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరచిందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందని ఆయన విమర్శించారు. జనసేన పార్టీ సరికొత్త ఐటీ పాలసీతో ముందుకొస్తుందని.. అది రాష్ట్రాభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఐటీ విభాగం ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో 600 మంది ఐటీ నిపుణులు పాల్గొన్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ చాలా కీలకమని తెలిపారు. ఐటీ వింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పని చేయాలని సూచించారు. ఇప్పటి రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పెట్టుబడులు తీసుకొస్తామని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా జనసేన ఐటీ పాలసీ ఉంటుందని చెప్పారు. ఇక, పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5వ తేదీ నుంచి యాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa