కడపజిల్లాలోని సిద్దవటంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీని జనసేన అధినేత పవన్ కళయాణ్ ప్రారంభించారు. వ్యవసాయం కలిసి రాక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో జనసేన కౌలు రైతు భరోసా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... జిల్లాలోని సిద్దవటంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులను అందించడంతోనే పవన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 170 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా...వారి కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున పవన్ సాయం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa