సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేర్వేరుగా సమావేశం అయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణతో వై.ఎస్.జగన్ మర్యాదపూర్వంకంగానే భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటూ రమణతో సీఎం భేటీ కొనసాగింది. సీఎం జగన్ వెళ్లిన అనంతరం సీజేఐతో భేటీ టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. 15 నిమిషాల పాటూ ఇద్దరూ సమావేశం అయ్యారట. సీఎం జగన్-చంద్రబాబు కాన్వాయిలు క్లాష్ కాకుండా షెడ్యూల్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు వరుస సమావేశాలు మర్యాదపూర్వకంగానే అని తెలుస్తోంది.
అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ+7 నూతన భవనాలను హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, సీఎం జగన్తో కలిసి రమణ ప్రారంభించారు. 29 విశాలమైన ఏసీ కోర్టుల హాళ్లు, ఏడు లిఫ్టులు, న్యాయవాదులకు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్ సహా అన్ని సదుపాయాలతో నూతన కోర్టు భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa