టీడీపీకి వినూత్న సమస్యలు వెంటాడుతున్నాయి. టీడీపీకి కొంతకాలంగా ఫేక్ల బెడద వెంటాడుతోంది. తాజాగా సర్వేల పేరుతో మరో ఫేక్ ప్రచారం సాగుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మరికొందరు ఎమ్మెల్యేలు, నేతల పేరుతో ప్రెస్నోట్లు వైరల్ అయ్యాయి. తీరా ఆరా తీస్తే అవన్నీ ఫేక్ అని తేలాయి. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్ పేరుతో సర్వేలు వైరల్ అయ్యాయి. ఇవి కూడా ఫేక్ అని గుర్తించారు.. ఘాటుగా స్పందించి కౌంటర్ ఇచ్చారు.
‘టీడీపీమాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'రాబోయే రోజుల్లో జగన్ రాక్షస పాలనను అంతం అవ్వడం ఖాయం. అందుకోసమే మన నాయకుడు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ని కూడా కలుపుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.. అవసరం అయితే జనసేన పార్టీకి 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఆఫర్ చేయడానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారు’అంటూ రవికుమార్ వ్యాఖ్యలు చేశారన్నది ఆ ఫేక్ పోస్ట్ సారాంశం.
కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యల్ని చింతమనేని ప్రభాకర్ సమర్థించినట్లు మరో పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో ‘టీడీపీ నేత కూన రవి కుమార్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. జగన్ పాలన అంతమవ్వాలంటే విపక్ష పార్టీలన్నీ త్యాగాలకు సిద్ధపడాలి. దీనికి సంబంధించి మేము చేయించిన వివిధ సర్వేలలో జనసేన 15, బీజేపీ 4 ఎమ్మెల్యే స్థానాలలో బలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సమాచారాన్ని ఆయా పార్టీల అదినాయకత్వానికి అందించాం. కాబట్టి ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు పోటీ చేస్తే ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని ఆయన స్పష్టం చేశారు’అనేది చింతమనేని పేరుతో వైరల్ అవుతున్న పోస్ట్ సారాంశం.
ఇదంతా ఫేక్ అంటోంది టీడీపీ. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఎవరూ నమ్మొద్దంటున్నారు. తన పేరుతో సర్వే అన్నది పేటీఎం కూలీలు అల్లిన కథ అంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్ పేరుతో వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదని.. వాటిని నమ్మొద్దని కోరుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa