ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేక్ష‌కులు గెట్ రెడీ!

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 09:06 PM

చిన్న పెద్ద సినిమాలన్నీ ఈ సారి సంక్రాంతిని టార్గెట్ చేసాయి. మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల 'అల..వైకుంఠపురములో' ,కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంత మంచివాడవురా'...సినిమాలు 2020 సంక్రాంతికి వస్తున్నాయి. అయితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మాత్రమే సంక్రాంతికి పక్కా అనే విధంగా ఫాస్ట్ ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. దాంతో అసలు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే కన్ఫ్యూషన్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎట్ట్టకేలకు పొంగల్ బరిలో నిలిచే సినిమాలపై క్లారిటీ వచ్చింది. అల్లు అర్జున్ సినిమా 'అల..వైకుంఠపురములో' సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. అల...వైకుంఠపురములో...ఆదివారం రిలీజ్...అంటే షార్ట్ కట్‌లో అ..ఆ అనుకోవచ్చు. ఇక 'శతమానం భవతి' లాంటి నేషనల్ అవార్డు మూవీ రూపొందించిన సతీష్ వేగేశ్న, కళ్యాణ్ రామ్‌తో జతకట్టి తెరకెక్కిస్తున్న 'ఎంతమంచివాడవురా' షూటింగ్ కూడా దగ్గరపడింది. అందుకే ఆ సినిమాని జనవరి 15న రిలీజ్ చెయ్యబోతున్నారు.మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాకపోయినా జనవరి 10న ఆ సినిమా రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్‌ల సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది అని టాక్ వినిపించింది. కానీ ఆ సినిమా సంక్రాంతికి ముందే రిలీజ్ అవుతుంది. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ కాబట్టి ఆ రూమర్ వచ్చినట్టుంది. అయితే గత సంక్రాంతికి తెలుగు సినిమాలతో పోటీ పడుతూ 'పేట' సినిమా రిలీజ్ చేసిన రజినీ కాంత్ ఈ సంక్రాంతికి కూడా మురుగ దాస్ తెరకెక్కిస్తున్న 'దర్బార్'తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. మొత్తానికి ఈ పెద్ద పండగకి కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడానికి రెడీ అయిపోతున్నారు హీరోలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa