టాలీవుడ్ స్టార్ హీరో రవి తేజా 'మాస్ జాతర' అనే సినిమాతో ప్రేహకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా నటుడు కిషోర్ తిరుమాల దర్శకత్వంలో తన 76వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్, ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ని స్పెయిన్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో మేకర్స్ కీలకమైన దృశ్యాలని మరియు రెండు పాటలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రవి తేజ కి జోడిగా విశ్వంభర బ్యూటీ ఆషిక రంగనాథన్ నటిస్తుంది. ఈ సినిమాకి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెల్లా మరియు ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా ఉన్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ కింద సుధాకర్ చెరుకురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ కంపోజర్ గా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సీజన్లో ఈ చిత్రం విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa