ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ షిర్డీ సాయి బాబాని దర్శించుకున్న 'థామా' బృందం

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 03:57 PM

మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో తదుపరి చిత్రం 'థామా' లో ఆయుష్మాన్ ఖుర్రానా మరియు రష్మికా మాండన్న ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 21, 2025న విడుదల కానుంది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం శ్రీ షిర్డీ సాయి బాబాని దర్శించుకొని అశీసులు తీసుకున్నారు. ఈ సందర్శనకు సంబందించిన చిత్రాలని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని నైరెన్ భట్, అరుణ్ ఫ్యులారేరా మరియు సురేష్ మాథ్యూ రాశారు. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్ ప్రదర్శిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa