ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండ్ల గణేష్ సంచలన పోస్ట్: ఆట ఎవరిదో జనాలే నిర్ణయిస్తారు!

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 08:23 PM

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. 'అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!' అని ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు, సినీ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరో ఒకరిని ఉద్దేశించి కావాలనే ఈ పోస్ట్ పెట్టారని, ఇటీవల టాలీవుడ్ లో జరిగిన వివాదాలకు ఇది పరోక్ష స్పందన అని అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa