ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైల‌ర్ సూప‌ర్ అంటున్న ప్రిన్స్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 07:09 PM

కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విజయ్‌ దేవరకొండ, వర్ధన్‌ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని మహేశ్‌బాబు విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రిన్స్ మ‌హేష్ మాట్లాడుతూ నాకు బాగా నచ్చిన సినిమా ‘పెళ్ళి చూపులు’. ఆచిత్ర ద‌ర్శ‌కుడు తరుణ్‌ భాస్కర్‌ హీరో అని వినగానే కొత్తగా అనిపించింది. అందునా నాకు కావాల్సిన వ్య‌క్తి  ‘‘విజయ్‌ ప్రొడ్యూసర్గా  నిర్మించిన . ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్‌ చాలా బాగుంది. కథ ఆసక్తిగా అనిపించింది’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మీకు మాత్రమే చెప్తా’ కథాంశం బాగా నచ్చి నేనే నిర్మించా. నిర్మాత బాధ్యతలు మా నాన్న వర్ధన్‌ దేవరకొండగారు తీసుకున్నారు. నా మనసుకు నచ్చిన సినిమా ఇది.  నా అభిమాన హీరో మహేశ్‌గారు ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
 ‘‘ఈ మూవీలో నన్ను హీరో అంటున్నారు. కానీ, నేను ఓ నటుడిగానే భావిస్తున్నా. కథ, కథనాలు ఫన్‌గా ఉంటాయి’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌.  ‘‘ఈ సినిమా ఓ సంఘటన ఆధారంగా   అందరికీ కనెక్ట్‌ అయ్యే పాయింట్‌తో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాం,  డైలాగ్స్‌ రాసిన తరుణ్‌ భాస్కర్‌కి థ్యాంక్స్‌.’’ అన్నారు ద‌ర్శ‌కుడు షమ్మీర్‌ సుల్తాన్‌. ఇందులో నటీనటులు అనసూయ భరద్వాజ, వాణి భోజన్, అభినవ్‌ గోమటం, నవీన్‌ జార్జ్‌ థామస్‌ మాట్లాడారు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa