వెంకటేశ్వర భక్తి ఛానెల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ప్రముఖ దర్శకుడు ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి స్వామి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త శ్రీ వేంకటేశ్వర్లు (తిరుపతి), ఎస్వీబీసి ఛైర్మన్ పృథ్వీ గారూ.. తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ (వైఎస్ఆర్సిపీ), రాగల 24 గంటల్లో చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు గారూ హాజరయ్యారు. వీళ్ళ సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు శ్రీ ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి. హాస్యనటుడు పృథ్వి ఇప్పటికే ఎస్వీబీసి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గతంలో శ్రీనివాస రెడ్డి కింగ్ నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రలలో సోసియో ఫాంటసీ చిత్రం ఢమరుకం తెరకెక్కించాడు. అలాగే చందనా బ్రదర్స్.. బొమ్మనా సిస్టర్స్, అదిరిందయ్యా చంద్రం వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి సత్య దేవ్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలలో రాగాల 24 గంటల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa