ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని నుంచి చిరంజీవికి ఆహ్వానం

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 07:29 PM

ఈమధ్య మహాత్మ గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని మోదీ ఇంట జరిగిన ఒక కార్యక్రమంలో అంతా ఉత్తరాది తారలే దర్శనమిచ్చారు. దక్షిణాది నుంచి చాల తక్కువ మందికి ఆహ్వానాలు వెళ్లడంతో ఆ వేడుకలో అంతా ఉత్తరాది భామల హవానే కొనసాగింది. దీనికి సంబంధించి రామ్ చరణ్ భార్య ఉపాసన మోదీకి ట్విట్టర్ ద్వారా దక్షిణాది తారలను తక్కువ చేసి చూడటం బాధించిందని, దక్షిణాది తారలను కూడా వేడుకకు పిలిస్తే బాగుండేదని వ్యాఖ్యానాలు చేసింది.
ఉపాసన వ్యాఖ్యల తరువాత చాల మంది ఆమెకు మద్దతుగా దక్షిణాది తరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ఉత్తరాది రాష్ట్రాలు ఒక్కటే కాదని, ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడటానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా చాల కీలకమని వ్యాఖ్యనాలు రావడంతో ఇప్పుడు రామ్ చరణ్, చిరంజీవికి ప్రధాని మోదీ నుంచి పిలుపు వచ్చిందని, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వ్యాఖ్యలు రావడంతో ఉపాసన ట్వీట్ వలన దక్షిణాది వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని మోదీ చెప్పకనే చెప్పారా అన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.
ఇక మరోవైపున మరికొంత మంది ప్రధాని మోదీకి రామ్ చరణ్, చిరంజీవికి అప్పాయింట్మెంట్ ఇవ్వడం వెనుక ‘సైరా” సినిమా ఉందని, గతంలోనే ప్రధాని మోదీని కలవాలని చిరంజీవి అనుకున్నారని కానీ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ఉండటం వలన అది వీలు పడలేదని ఇప్పుడు మోదీ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్, చిరంజీవి ఇంకా మహారాష్ట్రలో ఎన్నికల వేడి తగ్గకపోవడంతో రాజకీయ వేడి తగ్గిన తరువాత మోదీని కలవాలని అనుకుంటున్నారట. మోదీని కలసి “సైరా” సినిమా విశేషాలతో పాటు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పదనాన్ని తెలియచేయడానికి చిరంజీవి త్వరలో మోదీని కలవనున్నట్లు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa