ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిలేరు’ అనే పాట సైనికుల త్యాగాలకు నివాళి: విజయశాంతి

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 09:38 PM

‘సరిలేరు’ అనే పాట భారత సైనికుల త్యాగాలకు మరింత స్ఫూర్తివంతమైన నివాళని కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి పేర్కొన్నారు. మహేశ్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రను పోషిస్తున్నారు. ఈ మేరకు ఫేస్ బుక్ ద్వారా విజయశాంతి స్ఫూర్తిదాయకమైన పోస్ట్ చేశారు.
మహాత్మాగాంధీ, తిలక్, గోఖలే, ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్ సింగ్, ఆజాద్, అంబేద్కర్…. వీరితో పాటు చరిత్రకు అందని ఎందరో స్వతంత్ర పోరాట అమరవీరులు… ఆనాడు వారి ప్రాణాలొడ్డి ఐరోపా జాత్యహంకారానికి వ్యతిరేకంగా దురాక్రమణను ప్రతిఘటించిన ఫలితమే మన స్వాతంత్ర్యమని ఆమె చెప్పారు.
‘సరిలేరు’ అనే పాట విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ భారతీయ సైన్యానికి నివాళిగా ఇప్పుడు వస్తోందని విజయశాంతి తెలిపారు. యూరోపియన్ కళాకారులు తమ సౌజన్యంతో ఈ పాటకు ప్రాణంపోయడం ఆనాటి మహోన్నతుల త్యాగాలకు మరింత స్ఫూర్తివంతమైన నివాళి అని అన్నారు. వందేమాతరం… జై భారత్… మీ ప్రొఫెసర్ భారతి అంటూ ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa