ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషమంగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆరోగ్యం

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 03:26 PM

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు ప్రముఖ బాలీవుడ్  డైరెక్టర్ జగన్ శక్తి . 2019లో  అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘మిషన్ మంగళ్’కు  జగన్  శక్తి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కంటే   ముందు  ‘చీనీ కమ్’తో  పాటు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జగన్ శక్తి మెదడులోని రక్తం గడ్డ కట్టింది. ఈ నేపధ్యంలో ఆయన ఆరోగ్యం విషమించిందని సమాచారం. ప్రస్తుతం జగన్ శక్తికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. జగన్ శక్తి ఆరోగ్యం విషమించిన నేపధ్యంలో ఆయన కుటుంబ సభ్యులంతా ముంబైకి చేరుకున్నారు. జగన్ శక్తి తన స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి కింద పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో జగన్ శక్తికి మెదడులో రక్తం గడ్డకట్టిందని  తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa