దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం వికారాబాద్ ఫారెస్ట్లో తారక్, చెర్రీ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలియా భట్, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ సరసన శ్రియా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అజయ్ దేవ్గన్కి వెల్కమ్ చెబుతూ తారక్ ట్వీట్ చేశాడు. దానితో పాటు లొకేషన్లో రాజమౌళి, అజయ్ దేవ్గన్, తారక్, చెర్రీ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Delighted to welcome you to the world of #RRR dear @ajaydevgn sir pic.twitter.com/9iKRJl11e5
— Jr NTR (@tarak9999) January 29, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa