బుల్లితెరపై యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన రఘు కుంచె , ఆ తరువాత గాయకుడిగా కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. ఆ తరువాత సంగీత దర్శకుడిగా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. దర్శకుడు పూరితోను .. హీరో ప్రభాస్ తోను నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. 'ఏక్ నిరంజన్' టైటిల్ సాంగ్ నేను పాడవలసింది. కానీ ఆ సమయంలో నాపై పూరి అలగడం వలన నేను ఆ పాటను పాడలేకపోయాను. ఇక ప్రభాస్ 'బంపర్ ఆఫర్' ఆడియోకి కూడా వచ్చాడు. 'ఎందుకే రవణమ్మ .. ' సాంగును భలేగా చేశావ్ డాళింగ్' అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ప్రభాస్ మనసు ఒక వైట్ పేపర్ లాంటిది. ఆ మనసులో ఎలాంటివి వుండవు. సెట్లో వున్న వారికి ఫుడ్ తెప్పించి ఆప్యాయంగా వడ్డించే గొప్పమనసు ఆయన సొంతం" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa