ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై పాన్ ఇండియా అంటే గుర్తొచ్చేది ప్రభాసేనా..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 29, 2020, 05:22 PM

బాహుబలి  సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు .బాహుబలి సినిమా తర్వాత  'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో సాహో  నటించిన ప్రభాస్. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 420 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది. అదే స్థాయిలో భారీ చిత్రాలు చేస్తున్నారు. ఆయన గత చిత్రం సాహో . ఇక ప్రస్తుతం చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా సైతం 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని పలు భాషలలో భారీగా నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.


కాగా భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభాస్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఇకపై అయన నుండి వచ్చే ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటుంది. హిందీలో ప్రభాస్ కి భారీ క్రేజ్ ఉంది, సాహో ఫలితమే అందుకు నిదర్శనం. కాబట్టి టాలీవుడ్ దర్శక నిర్మాతలలో ఎవరికైనా పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఫస్ట్ ఛాయిస్ గా ప్రభాస్ మారాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa