ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ 'ఖైదీ' కోసం అజయ్ దేవగన్...

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2020, 10:26 AM

మా నగరం ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో  కార్తీ హీరోగా నటించిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. డ్రగ్స్ మాఫియా, పోలీసుల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ్ , తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులను కూడా కనెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తుంది. ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్ ను ఎంపిక చేసింది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. జూన్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. మరి అజయ్ కి ఖైదీ ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa