ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరస్ పట్ల అవగాహన పెంచండి : రష్మీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2020, 02:23 PM

నేను షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకోలేనని నటి..యాంకర్ రష్మీ  తెలిపింది. ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధిస్తేనే  అది జరుగుతుంది. మా నటీనటుల్లో  చాలా మంది నిర్మాతలకు చెందిన సంస్థల్లో కాంట్రాక్టుల్లో ఉంటారు. వారు షూటింగ్ ను వాయిదా వేయకుంటే మేము వెళ్లాల్సిందనని వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు షూటింగ్ ను క్యాన్సిల్ చేయగలరేమో కానీ మా లాంటి ఆర్టిస్ట్ లు చేయలేరని పేర్కొంది.  ఆపై “ఒకరితో ఒకరు యుద్ధం చేయడం ఆపండి. ఫ్యాన్స్ అంతా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలి. మీ కుటుంబాల్లో వైరస్ పట్ల అవగాహన పెంచండి. ఆ పని చేస్తే, వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. వైరస్ లక్షణాలున్న వారికి సాయపడండి. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. నన్ను ట్రోలింగ్ చేయడం వల్ల మీకేమీ లాభం ఉండబోదని  తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa