ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త కథకి ఓకే చెప్పిన చైతూ

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2020, 01:31 PM

నాగచైతన్య కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'నాగేశ్వర రావ్' సినిమా రూపొందనుంది. ఈ సినిమాను 14 రీల్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతుండగా పరశురామ్ కి మహేశ్ బాబు నుంచి పిలుపురావడం, ఆయన ఆ ప్రాజెక్టు పైకి వెళ్లిపోవడం జరిగింది.ఈ నేపథ్యంలో చైతూ తమకి ఇచ్చిన డేట్స్ ను 14 రీల్స్ వారు 'దిల్' రాజుకి ఇచ్చారట. దాంతో చైతూ హీరోగా సినిమా చేయడానికి 'దిల్' రాజు రంగంలోకి దిగాడని అంటున్నారు. బీవీఎస్ రవి అందించిన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని అంటున్నారు. ఈ లోగా నటీనటులు .. సాంకేతిక నిపుణులకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa