ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కని మహ్మద్ సిరాజ్

sports |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 03:36 PM

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కని విష‌యం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలను సెలక్టర్లు పేసర్లుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కోల్పోవడంపై సిరాజ్ స్పందించాడు. నిరాశ వ్యక్తం చేసినప్పటికీ, జట్టుకు తన శుభాకాంక్షలు తెలియజేశాడు.న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు ఇండోర్‌లో మీడియాతో మాట్లాడిన సిరాజ్గ త టీ20 ప్రపంచకప్‌లో ఆడాను. కానీ, ఈసారి అవకాశం రాలేదు. ఒక ఆటగాడికి ప్రపంచకప్‌లో ఆడటం అనేది ఒక కల. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం ఇంకా గొప్ప విషయం. ప్రస్తుత జట్టు చాలా బలంగా, ఫామ్‌లో ఉంది. వారికి నా శుభాకాంక్షలు. కప్‌ను ఇక్కడే ఉంచండి అని అన్నాడు.అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లకు పనిభారం నిర్వహణ ఎంత ముఖ్యమో సిరాజ్ వివరించాడు.దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 40 ఓవర్లు బౌలింగ్ చేయడంతో గత వన్డే సిరీస్‌కు నాకు విశ్రాంతి ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్‌కు సరైన విశ్రాంతి చాలా అవసరం. నిలకడగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు లయ, ఏకాగ్రతను కాపాడుకోవడానికి తిరిగి శక్తిని పుంజుకోవడం ముఖ్యం అని సిరాజ్ తెలిపాడు.భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ ఈరోజు ఇండోర్‌లో జరగనుంది. ఇక, టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభమై మార్చి 8న ఫైనల్‌తో ముగియనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa