ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో కొత్త రూల్స్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 11:31 AM

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయి పోయాయి. కరోనా ఎఫెక్ట్ తో సినీ పరిశ్రమ కూడా దివాలా తీసింది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా సినీ పరిశ్రమ పై, థియేటర్ల పై ప్రభావం తప్పనట్టుంది. మన దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు దాదాపు రూ. 3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. ఒక్క టాలీవుడ్ చిత్ర పరిశ్రమనే రూ. 800 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్టు సమాచారం. ఎందుకంటే ప్రజలు ఎంజాయ్ కోసం సినిమాలకు వెళ్లేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో పైసలు సేవ్ చేసుకోవడం కోసం ప్రజలు సినిమాలను తక్కువగా చూసే అవకాశం ఉంది. కరోనా ప్రభావం తగ్గినా ప్రజలు భయంతో కొన్ని రోజుల పాటు థియేటర్లలో కాలు పెట్టే అవకాశం లేదు. లాక్‌డౌన్ తర్వాత ప్రజలు థియేటర్స్ వైపు రావడానికి మల్టీప్లెక్స్ యాజామాన్యం సీట్ల తగ్గించి మనిషికి మనిషికి మధ్య మూడు సీట్లు గ్యాప్ ఉండేలా సిటింగ్ సిస్టమ్ మార్చనున్నట్లు సమాచారం. మాములు సింగిల్ థియేటర్స్ యాజమాన్యం వాళ్లు కేవలం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలనే కొత్త నిబంధనను అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సీట్లను తగ్గించి టికెట్ రేట్లు పెంచితే అసలు ఎవరూ సినిమాలకు వచ్చే అవకాశం ఉండదు. దీంతో థియేటర్లకు నష్టాలు తప్పకపోవచ్చు. అందుకే సామాజిక దూరం పాటిస్తూనే టికెట్ల రేట్లు పెంచకుండా థియేటర్లు నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా సినిమాలు విడుదల అయినా అంత త్వరగా లాభాలు వచ్చే అవకాశం లేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత విడుదల అయ్యే సినిమాలకు నష్టాలు తప్పవని టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa