ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్‌డౌన్ లో పేదల ఆకలి తీరుస్తున్న హీరోయిన్ ప్రణీత

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 27, 2020, 02:37 PM

కరోనా వైరస్ లాక్‌డౌన్ వేళ పలువురు సెలబ్రిటీలు సామాజిక సేవ చేస్తోన్న విషయం తెలిసిందే. చాలామంది ఇంట్లో వంటలను చేయించి నిరాశ్రయులైన వారికి అందిస్తున్నారు. మరికొందరేమో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూట గడవని వారికి, రోజువారీ కూలీలకు తన వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున 50కుటుంబాలకు లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించిన హీరోయిన్‌ ప్రణీత సుభాష్.. మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకుంది.. తానే స్వయంగా వంట చేసి, వండిన పదార్థాలను ప్యాకింగ్ చేసి అవసరం ఉన్నవారికి చేరవేస్తోంది. లాక్‌డౌన్ మొదలైన తర్వాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసింది. ముఖానికి మాస్కు ధరించి వంట చేస్తూ, ప్యాకింగ్ చేస్తున్న ఫొటోలను ప్రణీత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఆమె చేస్తున్న మంచి పనిపై వాళ్లు పొడగ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రణీత ఇది వరకే యాభై కుటుంబాలకు సాయం చేసేందుకు రూ. లక్ష విరాళం ప్రకటించింది. దాంతో పాటు పలువురికి నిత్యావసరాలు కూడా అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa