లాక్ డౌన్ కారణంగా వలసకూలీలు ఎన్నో అవస్థలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యువ దర్శకుడు హరీష్ శంకర్ వారి వేదనను ట్విట్టర్ ద్వారా తెలిపారు. "బండరాళ్లని పిండి చేసిన చేతులు ఎడమపక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి. పెద్ద పెద్ద ఇనుప చువ్వలని వంచిన వేళ్ళు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి. మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళితే చాలనుకుంటూ.. ఆకలి అడుగులతో.. పేగలు అరుపులతో.. కాళ్లు, కడుపు ఒకేసారి కాలుతుంటే ..మమ్మల్ని చూసే లోకులకి బాధేస్తోంది.. జాలేస్తోంది.. కానీ మాకు మాత్రం ఆకలేస్తోంది" అంటూ మనసును కదిలించేలా రాసారు.