ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు వార్తలపై లెజెండరీ గాయనీ ఎస్ జానకి సీరియస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 01:47 PM

లెజెండరీ గాయనీ ఎస్.జానకి మరణించారంటూ సోషల్ మీడియాలో కొందరు వార్తలు వైరల్ చేసారు. అది చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దాంతో ఈ వార్తలపై ప్రముఖ గాయని ఎస్ జానకి వెంటనే స్పందించారు. వదంతులను నమ్మొద్దని.. వాటిని చూసిన అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యొదని ఆమె కోరారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది జానకి. దీనిపై ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా స్పందించారు. అమ్మ క్షేమంగా ఉందని, సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్న వాళ్లపై చర్యలు దారుణంగా ఉండాలని ఆయన పోలీసులను కోరాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa