ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ క్షణంలోనైనా ప్రాణం తీసుకుంటా

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 03, 2020, 04:18 PM

సినిమా తారలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తో పాటు.. కొన్ని సార్లు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. తాజాగా బోజ్ పురి హీరోయిన్ రాణి చటర్జి సోషల్ మీడియా వేదింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ధనుంజయ్ సింగ్ అనే వ్యక్తి అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ముసలిదాన అంటూ సంభోదిస్తూ అతడు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఆందోళన కలుగుతోందని చెప్పింది.అతడి వల్ల డిప్రెషన్ కు వెళ్తున్నానని.. ఆ సమయంలో తనకు ఆత్మహత్య తప్ప మరే మార్గం లేదన్నట్లుగా అనిపిస్తుందని తెలిపింది. మొదట్లో ఆ కామెంట్లను పట్టించుకోకూడనుకున్నాను.. మరీ నీచంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బ్లాక్ చేసినా అతడు మాత్రం నన్ను వదిలి పెట్టడం లేదు అంటూ ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. అతడి నుండి తనను కాపాడకుంటే నేను ఏ క్షణంలో అయినా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa