అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా జరిగిన లాస్ట్ షెడ్యూల్లో చిత్రబృందం ఓ రొమాంటిక్ సాంగ్తో పాటు అఖిల్, పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ను కూడా షూట్ చేసింది. అయితే ఈ లవ్ సీన్స్ చాలా బాగావచ్చినట్టు టాక్. అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని అభిమానులు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే, అఖిల్ ఇద్దరు కలిసి ఉన్న ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Akhil Akkineni & Pooja Hegde from the sets of #MostEligibleBachelor@AkhilAkkineni8 @hegdepooja pic.twitter.com/thgmiOsemY
— BARaju (@baraju_SuperHit) September 18, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa