ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ లాక్డౌన్‌ సమయంలో వారితోనే ఎక్కువ సమయం గడిపా : రష్మిక

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 03, 2020, 12:19 PM

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇక సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. తన అభిమానులను ఉద్దేశిస్తూ రష్మిక మందన్నా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. తన జీవితంలోఎదురైన సమస్యలను అభిమానుల అండదండలతో దాటానని, అభిమానులే తన బలమని, ఈ లాక్డౌన్‌ సమయంలో వారితోనే ఎక్కువ సమయం గడిపానని చెప్పింది రష్మిక. త్వరలోనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నట్లు కూడా రష్మిక చెప్పింది. ఈ ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హిట్‌ కొట్టిన రష్మిక, ఇప్పుడు అల్లుఅర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తోంది. అలాగే తమిళంలో కార్తి హీరోగా చేస్తున్న 'సుల్తాన్‌' సినిమాలోనూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa