బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి ఏడాది కావొస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఇప్పటికి వీడని మిస్టరీగానే మిగిలింది.ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఐదు ఇన్వెస్టిగేటింగ్ సంస్థలు పూనుకున్నప్పటికీ, ఇంతవరకూ విజయం సాధించలేదు.బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణంతో గత ఏడాది ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. అప్పటికే పలువురు లెజెండరీ నటులను కోల్పోయిన ఇండియన్ సినిమా సుశాంత్ మరణంతో నివ్వెరపోయింది. “ఎం ఎస్ ధోని” సినిమాలో తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ గత ఏడాది జూన్ లో ఇదే రోజున మరణించాడని బయటకొచ్చిన వార్త చాలా మంది మనసుని కూడా విరిచేసింది.మొత్తానికి సుశాంత్ సింగ్ మరణం దేశాన్ని కుదిపేసింది. ఈ రోజున పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్కు నివాళులు అర్పిస్తూ తమతో సుశాంత్ బంధాన్ని నెమరేసుకుంటున్నారు. ఇకనైనా దర్యాప్తు సంస్థలు విచారణ వేగంగా పూర్తి చేసి డెత్ మిస్టరీని చేధించాలని సుశాంత్ సింగ్ అభిమానులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa