ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతికి అల్లరి చెయ్యబోతున్న ''అతిథి దేవోభవ''

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 12:05 PM

 


సాయికుమార్ తనయుడు  ఆది  నటించిన లేటెస్ట్ మూవీ ''అతిథి దేవోభవ''.  ఈ చిత్రంలో నువేక్ష హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాక నాగేశ్వర్ పొలిమేర దర్శకత్వంలో తెరకెక్కనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. 'RRR ' సినిమా వాయిదా పడటంతో జనవరి 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఇప్పటికే 'అతిథి దేవోభవ' చిత్రం నుంచి వచ్చిన  టీజర్,  పాటలకు మంచి స్పందన లభించింది. బుధవారం హీరో నాని చేతుల మీదుగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.'బుద్ధుడికి ఏకాంతంలో ఉన్నప్పుడు జ్ఞానోదయం కలిగింది' అని హీరోయిన్ చెప్పగా 'ఒంటరిగా ఉంటే జ్ఞానం పుడుతుందా..? మరి నాకేంటి భయం పుడుతుంది' అని ఆది సాయి కుమార్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో ఒంటరిగా ఉండాలంటే భయపడే అభయ్ రామ్ అనే పాత్రలో ఆది కనిపించారు.తనలోని భయం కారణంగా అభయ్ ఎలాంటి పరిస్థితులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఏమేమి వదులుకోవాల్సి వచ్చిందనేది 'అతిథి దేవోభవ' చిత్రంలో చూపించబోతున్నారు. ఓవైపు భయపడుతూ మరోవైపు భయపెడుతుండటం అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa