ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలిం ఇండస్ట్రీ లో 22 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరీ జగన్నాధ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:56 PM

క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ పూరీ జగన్నాధ్ భారతీయ చలనచిత్రంలో విజయవంతంగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సెన్సషనల్ డైరెక్టర్ 'బద్రి' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ అండ్ అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా 22 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 20న విడుదలైంది. ఆ తర్వాత పూరి చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు అండ్ అభిమానులు సోషల్ మీడియాలో దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బద్రి, శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాలకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'లైగర్‌' సినిమా విడుదల కోసం వేచి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa