ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటుడు 'ప్రతీక్ గాంధీ' కి చేదు అనుభవం

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 10:53 PM

'స్కామ్ 1992' ద్వారా ప్రతీక్ గాంధీ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యారు. హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తీసిన ఆ వెబ్ సిరీస్‌తో ఆయన పేరు మార్మోగింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో హీరోగా ఆయన సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ క్రమంలో ఆదివారం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. షూటింగ్‌కు వెళ్లేందుకు పయనమైన తాను ట్రాఫిక్ సమస్యలో చిక్కుకున్నానన్నారు. ఆ సమయంలో తాను కారు దిగి వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే(డబ్ల్యూఈహెచ్‌)పై నడిచి వెళ్తున్నాన్నారు.

ఓ వీఐపీ వస్తున్న కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తిందన్నారు. అయితే తనను ఓ పోలీసు కాలర్ పట్టుకుని నెట్టేశాడన్నారు. తాను చెప్పింది కూడా కనీసం వినకుండా దురుసుగా ప్రవర్తించాడన్నారు. పక్కనే ఉన్న మార్బుల్ గోడౌన్‌లో తనను తోసేశారన్నారు. ప్రతీక్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలో పర్యటించారు. ఆ కారణంగానే వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రతీక్ గాంధీ ప్రస్తుతం 'పూలే' చిత్రంలో నటిస్తున్నారు. అందులో ఆయన 'జ్యోతి బాఫూలే'గా, పత్రలేఖ 'సావిత్రి ఫూలే' పాత్రలను పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa