ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌డి పడి లేచే మ‌న‌సు వ‌చ్చేది అప్పుడే

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 26, 2018, 02:46 PM

శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 21న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ భారీ షెడ్యూల్‌ జరిపారు. అనంతరం నేపాల్‌లో చిత్రీకరణ జరపనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. శర్వానంద్‌ కొత్తలుక్‌ అభిమానులను అలరించింది. సినిమాపై అంచనాలు పెంచింది.


ఇతర పాత్రల్లో మురళీ శర్మ, సునీల్‌, ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌, ప్రియారామన్‌, అభిషేక్‌ మహర్షి నటిస్తున్నారు. నిర్మాతలు సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa