ఆనంద్ రవి, కిషోరీ ధాత్రిక్ జంటగా నటిస్తున్న చిత్రం "కొరమీను". శ్రీపతి కర్రీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'జాతర' ఫుల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. అనంత నారాయణ్ స్వరపరిచిన ఈ పాటను వాసుదేవ్ పాడారు. పూర్ణాచారి లిరిక్స్ అందించారు. జాలరి పేట ఎలా ఉంటుంది, అక్కడి మనుషుల ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి.. అనేది ఈ సాంగ్ లో చాలా బాగా చూపించారు.
రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్, శత్రు, హరీష్ ఉత్తమన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతుంది.