డీజే తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తండా’ ను హరీష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈనెల 21 నుండి ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి ‘వాల్మీకి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఒరిజినల్ వెర్షన్ లో బాబీ సింహ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ నటించనుండగా సిద్దార్థ పాత్రకి శ్రీ విష్ణు కానీ నాగ శౌర్య ను తీసుకుంటారనే ప్రచారంజరిగింది. కానీ ఇప్పుడు ఈ పాత్రకు తమిళ యువ హీరో అథర్వ మురళి ని పేరును పరిశీలిస్తున్నారని టాక్. అయితే త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa