ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరస హత్యల నేపధ్యలో కొనసాగే త్రిల్లర్ సినిమా ‘రత్తం’

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 02:07 PM

ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు కమల్‌ బోరా, జి.ధనుంజయన్‌, ప్రదీప్‌ బి, పంకజ్‌ బోరా సంయుక్తంగా నిర్మించిన ‘రత్తం’ చిత్రానికి సీఎస్‌ అముదన్‌ దర్శకుడు. విజయ్‌ ఆంటోని హీరోగా నటించగా.. మహిమా నంబియార్‌, నందితా శ్వేత, రమ్య నంబీశన్‌  హీరోయిన్లుగా నటించారు. సంగీతం కన్నన్‌ నారాయణన్‌. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ... దర్శకుడు అముదన్‌ నుంచి రానున్న మరో విభిన్న కథా చిత్రం. ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అన్నారు. దర్శకుడు అముదన్‌  మాట్లాడుతూ... ‘సాధారణంగా చిత్ర నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాక ఇలాంటి ఫంక్షన్లను గ్రాండ్‌గా నిర్వహిస్తుంటాం. కానీ, ఇపుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా తండ్రి చనిపోయినపుడు మొట్టమొదట వచ్చి నన్ను ఓదార్చిన వ్యక్తి విజయ్‌ ఆంటోని. ఆ రోజు ఆయన నాకు చెప్పిన మాటలు గుర్తున్నాయి. అవే మాటలు ఇపుడు విజయ్‌ ఆంటోనికి చెబుతున్నాం.. ‘మీ వెంట మేమున్నాం’ అని అన్నారు. కాగా, ఈ చిత్రం తమిళనాట జరిగిన వరుస హత్యలను కథాంశంగా తీసుకుని తెరకెక్కించారు. అక్టోబరు 6న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa